IND-PAK: PSL కొనసాగడం కష్టమేనా?
పాక్-IND: పాకిస్థాన్లో నిర్వహించే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (PSL) నిర్వహణ ఇప్పుడు సంక్షోభంలో పడిపోయింది. దీనికి కారణం ఈ మ్యాచ్లు నిర్వహించేందుకు ఎంపికైన స్టేడియంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం ఒకటి. ఇప్పుడు స్టేడియం కు సమీపంలో డ్రోన్ దాడి జరగడమే దీనికి కారణం .
పెషావర్ జల్మీ మరియు కరాచీ కింగ్స్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్లను తిరిగి షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అన్ని వాటాదారులతో సంప్రదింపులు, ఈ రాత్రి పెషావర్ జల్మి మరియు కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన PSL X మ్యాచ్ను తిరిగి షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. PCB సవరించిన తేదీ మరియు వేదికను ప్రస్తుతం ఉంది” అని PCB ఒక ప్రకటనలో విడుదల.
పాకిస్థాన్ సైన్యం సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడటంతో పాటు మిస్సైళ్ల దాడిని ఏర్పాటు చేసింది. ఆ దాడిని సమర్థంగా ఎదుర్కొంటోంది భారత్ సైన్యం యాంటిల్ సిస్టమ్తో ఆ క్షిపణులను తిప్పికొడుతోంది. కాగా, పాకిస్థాన్ రావల్పిండి క్రికెట్ స్టేడియంకు సమీపంలో ఓ డ్రోన్ దాడి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
పహల్గాంలో (పహల్గాం టెర్రర్ అటాక్) అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడిపై భారత్ ప్రభుత్వం తనదైన శైలిలో స్పందించింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్ (పాకిస్థాన్)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఆపరేషన్ సిందూర్ (ఆపరేషన్ సిందూర్) పేరుతో ఈ మెరుపు దాడులను నిర్వహించింది.
దీంతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్థాన్లోని ఉగ్రవాదులపై భారత్ దాడికి దిగితే.. అందుకు ప్రతీకగా పాక్ సైన్యం సరిహద్దుల్లోని అమాయక ప్రజలపై తన ప్రతాపం చూపుతోంది.
ఈరోజు జరిగిన నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ మా సహనాన్ని అలుసుగా తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు.