India-PakWar : ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు..

రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ

IND -Pak: పాకిస్తాన్ తో యుద్ధం వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని (territorial army) వినియోగించుకోవాలని ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది.

సరిహద్దు ప్రాంతాల  డ్రోన్‌లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది.

 ఇందులోని అధికారులు, నమోదు చేసుకున్న అధికార సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్‌కు కల్పించారు. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948 కింద కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో సాధారణ ఆర్మీతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేస్తుంది.

సైనిక రిజర్వ్ ఫోర్స్‌గా టెరిటోరియల్ ఆర్మీ పనిచేస్తుంటుంది. ప్రత్యర్థులతో తలపడేందుకు భారత్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు ఈ టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. సాధారణ ఆర్మీలో ఇది భాగమే అయినప్పటికీ అవసరమైన సందర్భంలోనే ఈ టెరిరియల్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది.

ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. 1962, 1965, 1971 యుద్ధాల్లోనూ భారత సైన్యంతో కలిసి టెరిటో ఆర్రియల్‌మీ పనిచేసింది. సాధారణ ఆర్మీకి సెకండరీ ఫోర్స్‌గా ఉండే టెరిటోరియల్ ఆర్మీలోని సిబ్బందికి నేషనల్ ఎమర్జెన్జీ, అంతర్గత భద్రతా విధులకు సంబంధించి శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం 32 టెరిటోరియల్ ఆర్మీ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ ఉన్నాయి.

మోహన్ లాల్ , ధోని వీరు కూడా లెఫ్ట్‌నెంట్ కల్నల్ లే..

ఇప్పటివరకు వివిధ సందర్భాల్లో  టెరిటోరియల్ ఆర్మీ ( territorial army) యుద్ధంలో పాల్గొంది. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా వారు సేవలు అందిస్తారు. గత ఏడాది కేరళ వరదల్లో మోహన్ లాల్ తన వంతు సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇతను లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగి ఉన్నాడు. అలాగే ధోని, సచిన్, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్ లు కూడా ఈ హోదాలో ఉన్నారు.

 

Leave a Comment