Operation Sindoor: భారత్ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమా?
IND-PAK: పహల్గాం ఉగ్రదాడికి భారత్ పాకిస్థాన్ కు ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్లో పాక్ ఉగ్రవాదులను చావుదెబ్బ తీసింది.
భారత ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. చీకటి పొద్దుపొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి సంబంధించిన సూచనలు. ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు పేర్కొన్నారు.
ఈ రెండు చోట్ల ఒక్కో క్యాంపులో 30- 40 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
వీటిల్లో లష్రే తొయిబా ప్రధాన సంస్థగా పేరుగాంచిన మర్కజ్ తొయిబా మదర్సా , ఇక బవహల్పూర్ ఉస్మాన్ ఓ అలీ క్యాంప్ జైషే ఉగ్రవాదకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దానిని నేలమట్టం చేసింది.
ఇప్పటివరకు వందమంది వరకు ఉగ్రవాదులు భారత్ వైమానిక దాడిలో మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై భారత్ ఆర్మీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.