ఎన్టీఆర్ అభిమానులకు దిమ్మ తిరిగే న్యూస్

‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ బయోపిక్ లో ఎన్టీఆర్

NTR As Dadasaheb Phalke: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR)  అభిమానులకు ఒక గుడ్ న్యూస్. ఫాదర్ అఫ్ ఇండియన్ సినిమా గా పేరుగాంచిన దాదా సాహెబ్ ఫాల్కే గారి బయోపిక్ లో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు న్యూస్ ఒకటి బాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందట ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో నితిన్‌ కక్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మాక్స్‌ స్టూడియోస్‌, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై వరుణ్‌ గుప్తా, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఎక్కడా ఈ సినిమా ప్రస్తావన రాలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఇందులో ఎన్టీఆర్ నటిస్తారని బాంబే మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘వార్ 2’ (War2) తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న తారక్.. సలార్, KGF చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత యంగ్ టైగర్ చేయబోయే రెండు ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే, ఎన్టీఆర్ ఓ బయోపిక్ లో నటించబోతున్నారట.

ప్రస్తుతం ఎన్టీఆర్ నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ‘వార్ 2’ లో నటిచున్నాడు. ఇప్పటికె వార్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇది ఎన్టీఆర్డ్ కు బాలీవుడ్ డెబ్యూ మూవీ . హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే కొరటాల శివతో ‘దేవర 2’ తెరకెక్కనుంది. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశి నిర్మాత గా వ్యవహరించనున్నట్లు సమాచారం. మాడ్ 2 సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ ఈ విషయాన్నీ చెప్పాడు.

 

Leave a Comment