మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి

మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి

COVID-19: భారత్‌లో కోవిడ్-19 మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. రోజు రోజు కి యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. మే 26 నాటికీ దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో 752 కొత్త కేసులతో కలుపుకొని 1,009 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం కేరళలో 430 అత్యధిక యాక్టివ్ కేసులతో గ్రస్థానంలో ఉంది. కేరళ తర్వాత మహారాష్ట్ర 209 కేసులతో రెండో స్తానంలో ఉంది . వీటి తర్వాత ఢిల్లీ (104), గుజరాత్ (83), కర్ణాటక (47), ఉత్తరప్రదేశ్ (15), మరియు పశ్చిమ బెంగాల్ (12) ఉన్నాయి.

ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు,  అండమాన్ & నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, ప్రస్తుతం యాక్టివ్ కేసులు లేవు .

ఏడు మరణాలు నమోదు

గత వారం రోజుల్లో మొత్తం 7 కోవిడ్-19 సంబంధిత మరణాలు నమోదయ్యాయి: మహారాష్ట్రలో 4, కేరళలో 2, కర్ణాటకలో 1 నమోదయ్యాయి:

తమిళనాడు, గుజరాత్ ల్లో కొత్త వేరియంట్లు

ఇండియాలో రెండు కొత్త కోవిడ్-19 వేరియంట్లు గుర్తించబడ్డాయి: NB.1.8.1 (తమిళనాడులో) మరియు LF.7 (గుజరాత్‌లో). ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వీటిని “వేరియెంట్ అండర్ మానిటరింగ్ ” (VUMs)గా వర్గీకరించింది. ప్రస్తుతం, ఈ వేరియంట్లు గ్లోబల్ పబ్లిక్ హెల్త్ రిస్క్ తక్కువగా ఉన్నాయని WHO ప్రాథమికంగా అంచనా వేసింది.

బీహార్‌లో తొలి కోవిడ్ కేసు నమోదు

బీహార్ లో తొలి కోవిడ్ కేసు నమోదయ్యింది. పాట్నాకు చెందిన 31 ఏళ్ళ వ్యక్తికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొదటి కోవిడ్-19 కేసు నమోదైందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆటను ఎటువంటి ప్రయాణాలు చేయలేదు అని తెలిసింది .

ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు

  •  బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం,
  • సామాజిక దూరం పాటించడం: సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు.
  • వ్యాక్సినేషన్: వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా తీవ్రమైన వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.
  • ఆరోగ్య సూచనలు పాటించడం: ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య సూచనలు పాటించడం ముఖ్యము.
  • ప్రస్తుత పరిస్థితిలో, ప్రజలు అప్రమత్తంగా ఉండటం, ఆరోగ్య సూచనలు పాటించడం, మరియు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు.

Leave a Comment